
అమరావతి :- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన గారికి ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు జలుబు తో ఇబ్బంది పడుతున్నారు ముందు జాగ్రత్తగా ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనను హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఏ ఐ జి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.