
దేశం లోకి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి డ్రైనేజీ పైపు ద్వారా ఎనిమిది మంది బెంగాల్ లోని హొవ్ డా నుంచి ట్రైన్లో ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో విజయవాడ లో ఆర్ పి ఎఫ్ సిబ్బంది బంగ్లాదేశ్లో ను పట్టుకున్నారు. వీరు హొవ్డా వాస్కోడిగామా రైల్లో వస్తున్న వీరి వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద పాస్ పోర్ట్ కూడా లేదు , వేళ్ళలో నలుగురిని విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులు విచారిస్తున్నారు ఈ విచారణలో డ్రైనేజీ పైపు ద్వారా భారత్ లోకి వచ్చినట్లు తేలింది. మిగిలిన వారి దగ్గర బెంగళూరు చిరునామాతో నకిలీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఉన్నట్లు గుర్తించారు. 2017 నుంచి 19 వరకు గోవా లో ఉన్నట్లు విచారణలో తేలింది. కోవిడ్ కారణంగా 2019లో బంగ్లాదేశ్ కి వెళ్లినట్లు గుర్తించారు. తిరిగి సంవత్సరం లో మళ్లీ గోవా వచ్చినట్లు విచారణలో వారు వెల్లడించారు. అయితే నలుగురిపై కేసులు నమోదు చేసి ఇ ప్రాథమిక విచారణ చేపట్టామని విజయవాడ నార్త్ జోన్ ఏ సి పి షేక్ షాను తెలిపారు.